సిధ్ధం..రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుపుకు కృషి చేయాలి.

Spread the love

ఈ నెల 22వ తారీఖున బ్రహ్మనాయుడు నామినేషన్

సాక్షిత : వినుకొండ పట్టణం లోని కారంపూడి రోడ్డు లోని బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నందు నేడు నియోజకవర్గ స్థాయి నాయకుల తో ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథులు గా *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మరియు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు * పాల్గొన్నారు….

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుటుంబ సభ్యులైన మనమందరం ఏకధాటిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 22వ తారీఖున మన వినుకొండ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా మరో సారి బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ వేస్తున్నారని, ఈ నామినేషన్ లో ప్రతి ఒక్క వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

వినుకొండ లో మనం చేసిన అభివృద్ధి ని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచాలు చేస్తూ కాలం ఎల్లబుచ్చుతున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి మనమందరం ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు..

Related Posts

You cannot copy content of this page