నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ లో “చలివేంద్రం” ను ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ గౌరవ శ్రీ రాగం నాగేందర్ యాదవ్

Spread the love

శేరిలింగంపల్లి డివిజన్ లోగల నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ వారు కార్పొరేటర్ ని షాలువా కప్పి పూలబొకే ఇచ్చి సన్మానం చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ…రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మార్కెట్ కి వచ్చే ప్రజలకు, మార్కెట్ చిరు వ్యాపారులకు మరియు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత వరకు అన్ని ఏరియాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. అనంతరం వెజిటబుల్ మార్కెట్ అభివృద్ధి చేసేందుకు సాయిశక్తుల కృషి చేస్తానని తెలిపారు. అలాగే మార్కెట్లోని చిరు వ్యాపారులను “ప్లాస్టిక్ ఫ్రీ” నీ పాటించి కాలుష్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ డి వీరేశం గౌడ్, వైస్ ప్రెసిడెంట్ షేక్ కాజా బాషా, అడ్వైజర్ హబీబ్ భాయి, అడ్వైజర్ రాఘవరావు, షేక్ అస్లాం, శ్రీను, రషీద్, శంకర్, మహమ్మద్ అజీమ్, మహమ్మద్ మొయిస్ లాల, రాజు, రాంచందర్, షైక్ దాదు, సల్మాన్, వెంకన్న, మహేందర్, షరీఫ్, శ్రీపాల్, శ్రీరాములు, SRP భరత్ మరియు శానిటేషన్ డిపార్ట్మెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page