ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా శేరి అనంత్ రెడ్డి

Spread the love

ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన శేరి అనంత్ రెడ్డి నియమితులయ్యారు. చేవెళ్ల నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్.. అనంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ వారికి కచ్చితంగా పదవులు ఉంటాయని భరోసా ఇచ్చారు.

అనంత రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి నియమించిన జాతీయ అధ్యక్షుడు దినేష్ సుందరియాల్, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, రాష్ట్ర, జాతీయ అధిష్టానానికి, జిల్లా, మండల, మున్సిపల్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి ఎజాస్, కౌన్సిలర్ రాములు, తౌఫిక్, నాయకులు ప్రశాంత్, మల్లికార్జున్, శ్రీకాంత్ ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page