SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని చర్చ్ గాగిల్లాపూర్ లోని 28వార్డు 214లో రూ.45 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు రూ.8 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్ జోస్ఫిన్ సుధాకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తామన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. కాలనీలో పర్యటించి కాలనీ సభ్యులు మరియు స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు..
ఈ కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ శంకర్ నాయక్, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, నాయకులు కరీమా, గుడిసె ఈశ్వర్, మోర హరీష్, సతీష్, మోహన్, పుల్ సింగ్, రాజు, యోగి, భారతి, శ్రీనివాస్, మంజు, మురళి మరియు స్థానిక నాయకులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS