రూ.15 లక్షల వ్యయంతో సి.సి.రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన శంభీపూర్ క్రిష్ణ …

Spread the love

సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి గండిమైసమ్మ 8వ వార్డులో రూ.15 లక్షల వ్యయంతో నూతన సి.సి.రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్లు సాయి యాదవ్, మహేందర్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ..


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తానన్నారు. మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తానని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. అనంతరం వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డులోని నిర్మాణంలో ఉన్న ఆలయం పనులను పర్యవేక్షించారు.. శమ్మిన్ మజీద్ ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు జక్కుల శ్రీనివాస్ యాదవ్, పాక్స్ వైస్ చైర్మన్ నాల్తురి క్రిష్ణ, డైరెక్టర్ వెంకటేష్, వార్డు ప్రెసిడెంట్ సర్వర్, నాయకులు హాజీ, తిరుమలేశ్, ఖాన్, మధు, జహంఘిర్ , మొలు, ఖాజా, ఇమ్రాన్, అసిఫ్, జాకీర్, సాయి, క్రిష్ణ, లింగం, రాజ్ కుమార్, మరియు తదితరులు, పార్టీ శ్రేణులు, స్ధానికులు, కాలనీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page