శేరిలింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా ఉంటా,నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..

Spread the love

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రజానీకానికి అందేలా కృషి చేస్తాం..
వి.జగదీశ్వర్ గౌడ్..
శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి..
కాంగ్రెస్ పార్టీ మరియు నా మీద నమ్మకం ఉంచి ఒక్క నెలలోనే నాతో నడిచి ఒక లక్ష తొమిది వేల తొమిది వందల ముప్పై (109930) ఓట్లు వేసి నన్ను కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన శేరిలింగంపల్లి ప్రజానీకానికి ఎల్లవేళలా రుణపడి ఉంటాం..

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృదే ప్రధాన లక్ష్యంగా,బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయాలనే ఆశయాన్ని బలం చేకూర్చే విధంగా నా వెంట నడిచిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు,నాయకులకు,అభిమానులకు ధన్యవాదాలు..

ఈరోజు మియపూర్ విశ్వనాథ గార్డెన్ నందు ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు భరోసాను అందించారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్..

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని,టీపీసీసీ అధ్యక్షులు .రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ జెండా రెపరేపలాడుతుందని,కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేస్తామని తెలిపారు.

ఎన్నికలలో గెలుపోటములు సహజం,ప్రజాతీర్పును గౌరవిస్తాం,నా వెంట నడిచిన నియోజకవర్గ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు,శేరిలింగంపల్లి ప్రజాలతోనే ఉంటాం,ప్రజాలకోసమే పని చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు,నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,మహిళ నాయకులు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Whatsapp Image 2023 12 05 At 3.49.07 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page