స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా..శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Spread the love

స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా..శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

హైదరాబాద్, రామచంద్రపురం యందు BHEL ఆవిర్భవించిన తరువాత ప్రప్రథమముగా BHEL పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించబడి, దినదిన ప్రవర్ధమానమై 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భముగా ఏర్పాటుచేసిన స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమంలో ఆర్.సి పురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ , జడ్జి నామాల అశోక్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మాజీ కౌన్సిలర్ గుర్రపు రవీందర్ రావు, సీనియర్ నాయకులు రామ్ మోహన్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిధులుగా పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . బిహెచ్ఇఎల్ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. BHEL తో వారికి ఉన్న అనుభూతులను పంచుకున్నారు. ఈ సమ్మేళనంలో వ్యవస్థాపక సభ్యులకు, పద్మశాలి ప్రముఖులకు, విశిష్ట నాయకులకు, సన్మానం మరియు మహిళలకు చిన్నారులకు ఆట, పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బిహెచ్ఇఎల్ పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుస రమేష్, జనరల్ సెక్రటరీ చెరుపల్లి వీణ నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మధుసూదన్, చీఫ్ పట్రోన్ చెరుపల్లి సోమదాస్, వైస్ ప్రెసిడెంట్ రవి కుమార్, కరుణాకర్, శ్రీహరి, గోపాల్ యాదవ్, సుధాకర్ రెడ్డి, సైదులు మరియు ట్రెజరర్లు, జాయింట్ సెక్రటరీస్, ఆర్గనైజర్ సెక్రటరీస్, చీఫ్ అడ్వైజర్స్, అడ్వైజర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page