కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండవ వార్డు కౌన్సిలర్ బిసోల్ల సంధ్యారాణి అశోక్ కుమార్ దంపతులు

Spread the love

శంకర్‌పల్లి: ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చేవెళ్ల నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ అన్నారు. సోమవారం భీమ్ భరత్ ఆధ్వర్యంలో నగరంలోని ఆయన నివాసంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీ రెండవ వార్డు కౌన్సిలర్ బిసోల్ల సంధ్యారాణి అశోక్ కుమార్ దంపతులు, వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి భీమ్ భరత్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. భీమ్ భరత్ మాట్లాడుతూ మరో వారం రోజుల్లో మండల, మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వలసలు భారీగా ఉంటాయని పేర్కొన్నారు.

అనంతరం కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్ దంపతులు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి ని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిత్యం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ సెక్రెటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్, మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, కౌన్సిలర్లు వాణి ప్రకాష్, లావణ్య శ్రీనివాస్ రెడ్డి, రాములు, సంతోష్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎజాస్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు నసీరుద్దీన్, మహబూబ్ హుస్సేన్, నాయకులు అనంత్ రెడ్డి, మోహన్ రెడ్డి, బలవంత్ రెడ్డి, పెంటయ్య, మల్లికార్జున్, ప్రశాంత్ కుమార్, నటరాజ్, మధు, నిఖిల్ ఉన్నారు

Related Posts

You cannot copy content of this page