SAKSHITHA NEWS

Sankranti bonfires under the direction of Vasaviclub president Belide Srinivas

వాసవిక్లబ్ అధ్యక్షుడు బెలిదె శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంక్రాంతి భోగిమంటలు.
ప్రారంభించి సంబరాల్లో పాల్గొన్న మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.


సాక్షిత : సంక్రాంతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని వాసవిక్లబ్ సూర్యాపేట అధ్యక్షుడు బెలిదె శ్రీనివాస్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాకేంద్రంలోని సాయిబాబా గుడి సమీపంలో ఏర్పాటుచేసిన భోగిమంటలు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్లబ్ సభ్యులతో కలిసి సంబరాలలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పండుగను అంగరంగవైభవంగా జరుపుకోవడం జరుకోవడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి KCR అధికారంలోకి వచ్చాక అన్ని పండుగలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు.

ఈ సంక్రాంతి పండుగను ప్రతిఒక్కరూ సంతోషంగా జరుపుకుని సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ వేడుకల్లో BRS పార్టీ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సవరాల సత్యనారాయణ, కౌన్సిలర్లు థాహెర్, భరత్, వాసవిక్లబ్ సభ్యులు మీలా వాసుదేవ్, తోట శ్యామ్, సింగిరికొండ రవీందర్, కలకోట లక్ష్మయ్య, రాచకొండ శ్రీను వనితాక్లబ్ అధ్యక్షురాలు కలకోట అనిత, బెలిదె రాధ, చల్లా లక్ష్మయ్య, భోనగిరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS