ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు వెడల్పు పనులు చేపట్టాలి : ఎమ్మెల్యే

Spread the love

Road widening works should be undertaken without any problems to the people: MLA

ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు వెడల్పు పనులు చేపట్టాలి : ఎమ్మెల్యే


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి నుండి దూలపల్లి మీదుగా బహదూర్ పల్లి వరకు సుమారు రూ.25 కోట్లతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనుల్లో భాగంగా దూలపల్లిలో రోడ్డు నిర్మాణ పనుల్లో కొంత ఇంటి స్థలాలు కోల్పోతున్న బాధితులతో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండిఏ, మున్సిపాలిటి అధికారులతో కలిసి సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుతున్న జనాభా దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు ఇప్పటినుండే ప్రణాళికాబద్ధంగా రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

రోడ్డు నిర్మాణ పనుల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ పనుల్లో కొంత మేర ఇండ్ల స్థలాలు కోల్పోతున్న వారి నివేదిక తయారు చేయాలని, బాధితులకు టీడీఆర్ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో స్థానిక మున్సిపాలిటి చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, కమిషనర్ శ్రీహరి, హెచ్ఎండిఏ సిపిఓ రవీందర్ రెడ్డి, ఈఈ రమేష్ కుమార్, డిఈ వేణుగోపాల్, ఏఈ రమేష్ బాబు, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, పాక్స్ డైరెక్టర్ బూర్గుబావి సత్యనారాయణ, కౌన్సిలర్ డప్పు కిరణ్ కుమార్, కోఆప్షన్ మెంబర్ వెంకటేష్, నాయకుడు దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page