సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యారంగంలో విప్లవాత్మకమార్పులు

Spread the love

సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యారంగంలో విప్లవాత్మకమార్పులు
నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు

21 సంవత్సరాలుగా ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

ఎమ్మెల్యే జిఎంఆర్ పై ప్రశంసల జల్లు

ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో ఘనంగా గురుపూజోత్సవం

నియోజకవర్గ పరిధిలోని 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం

తరలివచ్చిన ఉపాధ్యాయ లోకం

అలరించిన సంస్కృతిక కార్యక్రమాలు

సాక్షిత పటాన్చెరు : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి గురుపూజోత్సవ వేడుకలకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించారని తెలిపారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, రెసిడెన్షియల్ కళాశాలలో, మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసి బడుగు బలహీన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని అన్నారు.

దేశంలోనే మొట్టమొదటిసారిగా మన ఊరు మనబడి కార్యక్రమం ప్రారంభించి, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం ప్రతిరోజు తల్లిదండ్రుల నుండి వినతి పత్రాలు వస్తున్నాయని, ఇది సంతోషకరమైన పరిణామం అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం పేరిట గత 21 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎంపీపీగా ఉన్నప్పటినుండి 21 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గురుపూజోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. నవభారతానికి వెన్నుముకలుగా నిలిచే విద్యార్థులను భాయ్ భారత పౌరులుగా తీర్చిదిదద్దే ఉపాధ్యాయ రంగం అంటే తనకు ఎనలేని అభిమానం అన్నారు.

మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో విభిన్న రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన నిరుపేద కుటుంబాల పిల్లలు అత్యధిక శాతం ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. వారిని అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దాలని విన్నవించారు. ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ప్రభుత్వం అందించే నిధులతో పాటు సి ఎస్ ఆర్ నిధులతో నూతన పాఠశాల, కళాశాల భవనాలు, మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.

విద్యతో పాటు క్రీడారంగంపై ఆసక్తి పెంపొందించేందుకు ఐదు ఎకరాల సుశీల విస్తీర్ణంలో మూడు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు పట్టణం లో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

అనంతరం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమానికి హాజరైన ప్రతి ఉపాధ్యాయుడికి, ఉపాధ్యాయురాలికి ప్రత్యేక బహుమతులు అందచేశారు.

Related Posts

You cannot copy content of this page