నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం

Spread the love

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్….

బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, రోడ్డు వైండింగ్ పనులను త్వరితగినగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న మంచినీటి వ్వవస్థ , టిఎస్ ఎస్పిడిసిఎల్ , ఎచ్.ఎం.డి.ఏ పనులపై ఆయా విభాగాల అధికారులతో. ఎమ్మెల్యే కె పి వివేకానంద , మేయర్ నీలా గోపాల్ రెడ్డి, కమీషనర్ రామకృష్ణ రావు, తహసిల్దార్ ఫుల్ సింగ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యలు, ఆయా విభాగాల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, రోడ్డు వైండింగ్ పనులను వేగం పెంచి త్వరితగతిని పూర్తి చేసి ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కార్పొరేషన్ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత ఉన్నత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ సహకారంతో అభివృద్ధికి నిధుల లేకుండా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులను పూర్తిచేసుకున్నామని ప్రజల నుండి అందిన వినతులను అధికారులు సమన్వయ పరుచుకుంటూ వ్యయ ప్రణాలికను సిదం చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్,కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, వాటర్ బోర్డు, ఎచ్ ఎం డి ఏ, టి ఎస్ ఎస్ పి డి సి ఎల్, శాఖల అధికారులు, కార్పొరేషన్ ఉన్నత అధికారులు, టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page