.వరద నీటి సమస్య లేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతి…

Spread the love
Request to MLA to work without flood water problem...

వరద నీటి సమస్య లేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతి.


సాక్షిత :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని వాజ్ పాయ్ నగర్ కు చెందిన బస్తీ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నిన్న కురిసిన భారీ వర్షానికి బస్తీలో వరద నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నామని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో ఎమ్మెల్యే తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణా యాదవ్, రాజేష్ మరియు బస్తీ వాసులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page