హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ లో డ్రైనేజ్ మాన్ హాల్ రికన్స్ట్రక్షన్ పనులు

Spread the love

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ లో డ్రైనేజ్ మాన్ హాల్ రికన్స్ట్రక్షన్ పనులను జలమండలి డిజియెం వెంకటేశ్వర్లు మరియు మేనేజర్ ప్రశాంతి తో కలసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. అదే విధంగా, డ్రైనేజి మాన్ హాల్ పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని జలమండలి అధికారులకు తగు సూచనలు చేసిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ కార్యక్రమంలో డిజియెం వెంకటేశ్వర్లు,
జలమండలి మేనేజర్ ప్రశాంతి, హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు కోనేరు రాగ ప్రసాద్, రవి కుమార్, సూర్యనారాయణ, రాజేష్, సురేష్, గణేష్, కృష్ణ ప్రసాద్, నాగేశ్వరరావు, సత్యనారాయణ, నాగేందర్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page