బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి రంజిత్ కుమార్& టీమ్

Spread the love

షాక్ లో బీఆర్ఎస్ నాయకులు

ఎవరి రంజిత్ కుమార్ మండలంలో చర్చ

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రోజు రోజుకు రసవత్తరంగ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇందులో భాగంగా తాండూర్ మండలంలోని బీఆర్ఎస్కు భారీ షాక్ కలిగింది . రేచిని కి చెందిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బీఆరెస్ లీడర్ కోడిప్యాక రంజిత్ కుమార్ తన టీం తో సహా కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో వినోద్ నివాసం లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసలు ఎవరు ఈ రంజిత్ అని తాండూర్ మండలంలో చర్చ అనతి కాలంలోనే వ్యాపారవేత్తగా ఇటు రాజకీయంగా ఎదిగిన వ్యక్తిగా మండలంలోని ముఖ్య నాయకులకు రేచిని ప్రజలకు తెలుసు కానీ ప్రస్తుతం మండలంలో కీ రోలుగా వ్యవహరించడం మండలంలోని ముఖ్యులను సర్పంచులను ఎంపీటీసీలను కాంగ్రెస్లో చేరే విధంగా మోటివేషన్ చేయడం ద్వారా రంజిత్ అంశం చర్చనీయాంశమైంది.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభ్యర్థి వినోద్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన పథకాలే చెబుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తుందని ప్రజలు నూతన పథకాలతో కాంగ్రెస్ పార్టీ వస్తుందని ప్రజలు ఆదరించాలని రంజిత్ సేవలు ప్రజలకు కావాలని వినియోగించు కుంటామని ఇలాంటి నాయకులు అవసరమని గడ్డం వినోద్ అన్నారు . బెల్లంపల్లి నియోజకవర్గం లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని తమ సత్తా ఏంటో చూపెడతామని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని నాకు డబ్బులతో పని లేదని బ్రోకర్ వ్యవస్థ ససేమిరా నేను ఒప్పుకోనని వినోద్ అన్నారు.
కాంగ్రెస్లో జాయిన్ అయినవారిలో సింగిల్ విండో డైరెక్టర్ సంతోష్ కుమార్, బీఆర్ఎస్ యూత్ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 10 At 3.41.34 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page