ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ కదిలిన పువ్వాడ..

Spread the love

Puvvada moved by solving public problems..

ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ కదిలిన పువ్వాడ..

అనేక సమస్యలు తక్షణ పరిష్కారం..

సుదీర్ఘ సమస్యలు సైతం తక్షణ పరిష్కారం అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేపట్టిన వాడ వాడ పువ్వాడ కార్యక్రమం ప్రజల్లో విశేష ఆదరణ పొందింది. 50వ డివిజన్ నందు ఉదయం 6 గంటల నుండి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాడలోని ఇంటింటిని పలకరించారు. స్థానిక ప్రజలను కలిసి వారి క్షేమ సమాచారం తెలుసుకుని డివిజన్లలో ఎదుర్కొనే సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


మిషన్ భగీరథ నీరు, డ్రైనేజ్, సమస్యలను ప్రధానంగా మంత్రి పువ్వాడ దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే ఆయా త్రాగునీరు సమస్యలను పరిష్కరించాలని పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్ ను ఆదేశించారు. సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కార దిశగా వాడ వాడ పువ్వాడ కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page