ప్రజా సంక్షేమమే మా ధ్యేయం ఎమ్మెల్యే భూమన

Spread the love
Public welfare is our mission MLA Bhumana

ప్రజా సంక్షేమమే మా ధ్యేయం.

  • ఎమ్మెల్యే భూమన

  • సాక్షిత : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తాము పని చేస్తున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
    నగరపాలక సంస్థ పరిధిలోని మధురానగర్, గరుడాద్రి నగర్ లో సుమారు 1.50 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిసి డ్రైనేజీ కాలువలను శుక్రవారం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ లు ప్రారంభించారు
  • .
    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వెంటనే సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటికే నగరంలోని అన్ని ప్రాంతాల్లో సి.సి.రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించడం జరిగిందన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తెస్తే అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరిస్తామన్నారు
  • .
    ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నారాయణ, రాధారెడ్డి, బొకం అనిల్ కుమార్, కోటేశ్వరమ్మ, మునిసిపల్ ఇంజినీర్ వెంకట్రామిరెడ్డి, డి.ఈ లు విజయకుమార్ రెడ్డి, గోమతి, శానిటరి సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page