బహదూర్ పల్లిలోని 10వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలోని 10వ వార్డులోని టేక్ మహీంద్రా రోడ్డులో రూ.23 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్ బొంగూనురి నవిత శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తామన్నారు.

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. నిర్మిస్తున్న పనులలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ కి సూచించారు…
ఈ కార్యక్రమంలో బౌరంపేట పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కౌన్సిలర్లు శంకర్ నాయక్, మహేందర్ యాదవ్, గోపాల్ రెడ్డి, భారత్ కుమార్, సీనియర్ నాయకులు బొంగూనురి శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ నాయక్, నాయకులు కృష్ణయ్య, నాగరాజు, నాయుడు, అరవింద్, శ్రీనివాస్, మల్లేష్, మరియు స్థానిక నాయకులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page