వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు.

Spread the love

పల్నాడు జిల్లా..

వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు అధ్యక్షతన జరగ్గా..

ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ , జిల్లా జాయింట్ కలెక్టర్ శాంప్రసాద్ , ఆర్డిఓ శేషి రెడ్డి పాల్గొంన్నారు..

ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 2,06,171ఎకరాల చుక్కల భూములకు ఊరట లభించిందని, అందులోనూ మన పల్నాడు జిల్లా లో సుమారు 30,171 ఎకరాలు చుక్కల భూమి కి పరిష్కారం లభించిందని తెలిపారు.

వినుకొండ నియోజకవర్గం లోని 5మండలంలోని 9000 ఎకరాలకు లబ్ది చేకూరిందని అలాగే అగ్రహారం భూములు కూడా తొందరలోనే ప్రభుత్వం నుండి పరిష్కారం లభిస్తుందని తెలిపారు..

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లోని అన్ని మండలాల అధికారులతో పాటు గా నియోజకవర్గ లో లబ్ధి పొందిన రైతులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page