హుజూరాబాద్ హైస్కూల్ గ్రౌండ్ లో ప్రణవ్

Spread the love

హుజూరాబాద్ హైస్కూల్ గ్రౌండ్ లో ప్రణవ్

పలువురు వాకర్స్ తో మాటామంతి

-రాజేశ్వర్ రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసిన సీనియర్ సిటిజెన్స్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, అక్టోబర్ 28

హుజూరాబాద్ హైస్కూల్ గ్రౌండ్ లో శనివారం ఉదయం హుజూరాబాద్ కాంగ్రెన్ అభ్యర్థి వొడితల ప్రణవ్ మార్నింగ్ వాక్ చేసి పలువురు వాకర్స్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు వాకర్స్ ప్రణవ్ తో మాట్లాడుతూ.. మిమల్ని చూస్తే మీ తాత రాజేశ్వర్ రావు గుర్తుకు వస్తున్నారని, రాజేశ్వర్ రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.. హుజూరాబాద్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న సమస్యలను సైతం ప్రణవ్ కు వివరించారు. హుజూరాబాద్. కేంద్రంగా మాజీ ప్రధాని స్వర్గీయా పివి నర్సింహారావు పేరిట హుజూరాబాద్ జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని వాకర్స్ కోరగా ప్రణవ్ సానుకూలంగా స్పందించారు.

అలాగే హుజూరాబాద్ ప్రాంతంలో ఉన్న సమస్యలను ఆయనకు వారు వివరించారు. జమ్మికుంట రోడ్డులోని ఉడిపి హెూటల్లో టి తాగి అక్కడా పలువురితో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మీ లాంటి యువ నాయకులకు కాంగ్రెస్ టిక్కెట్ రావడం సంతోషంగా ఉందని పలువురు అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోవర్ధన్, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తాళ్లపల్లి రమేష్, డాక్టర్ చంద్రమౌళి, సొల్లు దశరథం తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 28 At 4.01.34 Pm

Related Posts

You cannot copy content of this page