SAKSHITHA NEWS

మునుగోడులో తెరాస విజయంపై పొంగులేటి హర్షం

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

మునుగోడు ఉప ఎన్నికలో తెరాస పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయంపై తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మంమాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా ఓటర్లు అభివృద్ధికే పట్టంకట్టారని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెరాస పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషిచేసిన ప్రతిఒక్కరికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తరుపున కృతజ్ఞతలు పొంగులేటి తెలిపారు.


SAKSHITHA NEWS