*మునుగోడు గెలుపు కెసిఆర్ ప్రధానమంత్రి కావడానికి మలుపు టీఆర్ఎస్ రాష్ట్ర నేత గోలి శ్రీనివాస్ రెడ్డి.

Spread the love

*మునుగోడు గెలుపు కెసిఆర్ ప్రధానమంత్రి కావడానికి మలుపు టీఆర్ఎస్ రాష్ట్ర నేత గోలి శ్రీనివాస్ రెడ్డి.

నవంబర్ 7,( సాక్షిత ప్రతినిధి):మునుగోడు గెలుపు దేశ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలకు మలుపు అని టీఆర్ఎస్ రాష్ట్ర నేత గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మునుగోడు లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందిన సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుకు సంక్షేమ పథకాలే ప్రధాన కారణమని నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా రైతు భీమా, రైతు బంధు, వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, షాది ముభారక్, కల్యాణలక్ష్మి లాంటి కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాలే ఈ గెలుపుకు ప్రధాన కారణం అని గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ గెలుపు బిజెపి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక మార్పు అనే అనొచ్చని హితవు పలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రజలు టిఆర్ఎస్ వైపే మొగ్గు చూపరాని, స్వామీజి లాంటి ఎంత మంది వచ్చినా తెలంగాణలో బిజెపి ఆటలు సాగవన్నారు.రాష్ట్రంలో ఎన్నికలు ఎక్కడ జరిగిన ప్రజల ఆదరణ టిఆర్ఎస్ పార్టీకే ఉంటుందని,తమ వాపును చూసి బలుపు అనుకుంటున్నారని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విపరీతమైన డబ్బులు,మద్యంతో గెలవాలని చూసిన బీజేపీకి ప్రజలు భూస్థాపితం చేసే రోజులు దగ్గరపడ్డాయాని, దానికి మునుగోడు పలితమే నాంది అని గోలి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page