పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం

Spread the love

Ponguleti Atmiya Sammelanam program is a success

పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

మేకల మల్లిబాబు యాదవ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఇల్లందు నియోజకవర్గ పొంగులేటి శీనన్న, కోరం కనకయ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నకు విచ్చేసిన కామేపల్లి మండలం మరియు ఇతర మండలాల పొంగులేటి శీనన్న అభిమానులు కార్యకర్తలు అందరికి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు.


కామేపల్లి లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ గ్రామాలకు కొద్దిమందికే పరిమితంగా, ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనాలని చెబితే అనూహ్యంగా వేలాదిమంది హాజరై విజయవంతం చేశారని మల్లి బాబు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

సమావేశం జరిగిన కొద్దిసేపటికి పొంగులేటి అభిమానులను ఇబ్బంది పెట్టడానికి కుట్ర పన్నుతున్నారని, అయినా పొంగులేటి అభిమానులు వీర సైనికులు లాగా ఒక ఉద్యమ కెరటం లాగా పొంగులేటి శీను అన్న నడిచిన దారిన నడుస్తారని స్పష్టం చేశారు.

Related Posts

You cannot copy content of this page