కొండబాల సతీమణి రాజేశ్వరి మృతికి పొంగులేటి, మువ్వా నివాళ్లు

Spread the love

Ponguleti and Muvwa are witnesses to the death of Kondabala’s wife Rajeshwari

కొండబాల సతీమణి రాజేశ్వరి మృతికి పొంగులేటి, మువ్వా నివాళ్లు


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు సతీమణి రాజేశ్వరి మృతిచెందారు.

ఆమె మృతి విషయం తెలుసుకున్న తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబులు ఇద్దరు కలిసి ఏఐజీ ఆసుపత్రిలోని ఆమె మృతదేహాన్ని సందర్శించారు.

భౌతికాయానికి నివాళ్లర్పించారు. రాజేశ్వరి మృతి కొండబాల కోటేశ్వరరావు కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజేశ్వరి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థించారు.

Related Posts

You cannot copy content of this page

Compare