కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ఢీకొన్న టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు

Spread the love

పటాన్‌చెరు : కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ఢీకొన్న టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 23న ఎమ్మెల్యే లాస్యనందిత కారు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రామేశ్వరం బండ సమీపంలో అవుటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. కారు డ్రైవర్‌ ఆకాశ్‌ నిద్రమత్తులో ఉండడంతో ముందు వెళ్తున్న టిప్పర్‌ను బలంగా వెనుక నుంచి ఢీకొట్టారు. అనంతరం ఓఆర్‌ఆర్‌ రెయిలింగ్‌ను ఢీకొనడంతో ఎమ్మెల్యే మృతి చెందారు.

సీసీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదం జరిగిన సమయంలో ఏఏ వాహనాలు వెళ్లాయో క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు వాటి డ్రైవర్లను విచారించారు. చివరకు టీఎస్‌ 08 యూజే 0025 అనే నంబరు గల టిప్పర్‌ను ఢీకొన్నట్లు గుర్తించారు. టిప్పర్‌ వెనుక భాగంలో ఉన్న సిగ్నల్‌ లైటుబోర్డు పగిలిపోయింది. కొద్దిగా పైభాగంలో ఉన్న గార్డులాంటి ఇనుపభాగం పక్కకు వంగిపోయింది. దీని డ్రైవర్‌ను గుర్తించి విచారిస్తున్నారు. అసలు ఆరోజు ఏం జరిగిందనే వివరాల కోసం ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగినట్లు డ్రైవర్‌ గుర్తించాడా? ఇబ్బందులు ఎదురవుతాయని ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయాడా? అనేది విచారిస్తున్నారు…….

Related Posts

You cannot copy content of this page