హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఇటీవల అనారోగ్యంతో మరణించిన రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వి. వేంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు రూ. 8,00,000/- ఎనిమిది లక్షల రూపాయలు అదేవిధంగా ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఆర్ ఆనిల్ కుమార్ కుటుంబ సభ్యులకు 7,87,820 రూపాయల భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …


శాఖపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైన పోలీస్ అధికారులు అందుబాటులో వుంటారని అన్నారు. పోలీసు కుటుంబాలకు అన్ని విధాల ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో కార్యాలయ ఏవో అక్తరూనీసాబేగం పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page