మల్లంపేట్ లోని 24వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని మల్లంపెట్ లోని 24వార్డులో
రూ.74 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు, డ్రైనేజీ మరియు తదితర నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ అర్కల అనంతస్వామి ముదిరాజ్ తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తానన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. కాలనీలో పర్యటించి కాలనీ సభ్యులు మరియు స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు..


ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మాదాస్ వెంకటేష్, సీనియర్ నాయకులు ఎంబరి ఆంజనేయులు, బీఆర్ఎస్ మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్ శామీర్పేట రంగయ్య, మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్, 24వ వార్డు ప్రెసిడెంట్ జి.రమేష్, మాజీ వార్డు సభ్యులు జీ.నరసింహ, బాల క్రిష్ణ, తిరుపతమ్మ, నాయకులు కోటేష్, శోభన్, కుమార్, డప్పు రము, నందు రాజు, ప్రశాంత్, శ్రీను, విజేందర్, తుకారాం, సాయి రామ్, కరుణాకర్, మనోహర్, జగపతి, రఘు, లాల్ బాబు, స్థానిక నాయకులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page