కేటీఆర్ రోడ్డు షోలో జనమే జనం.

Spread the love
People are people at KTR Road Show.

కేటీఆర్ రోడ్డు షోలో జనమే జనం..

కేటీఆర్ ప్రసంగానికి విశేష స్పందన.

మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్స్ తో రోడ్ షో.

భారీగా తరలిన శ్రేణులు..
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కే.టీ.రామారావు నిర్వహించిన రోడ్డు షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మండల కేంద్రంలోని చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు షోకు ముందు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో చేపట్టిన మోటార్ సైకిల్ లో ఖమ్మం నగరం నుండి తరలిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

రోడ్డు షోలో అన్ని కూడళ్లలో గులాబీ శ్రేణులు, యువత బాణాసంచా పేల్చుతూ, పూలు చల్లుతూ కేటీఆర్ కి దారి పొడవునా అపూర్వ స్వాగతం పలికారు.

ఆయా చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఫ్లోరోసిస్ రక్కసిని పాతరబెట్టి పరిశుద్ధమైన తాగునీళ్లను అందిస్తున్న, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని ఓటేసి గెలిపించాల్సిందిగా కోరారు.

కేటీఆర్ ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.”జై తెలంగాణ జై జై తెలంగాణ”, “జై కేసీఆర్ జై జై కేసీఆర్”, “జిందాబాద్ జిందాబాద్ టీఆర్ఎస్ జిందాబాద్”,”కారు గుర్తుకే మన ఓటు”అనే నినాదాలతో వీధులన్నీ హోరెత్తాయి.

Related Posts

You cannot copy content of this page