ఫతేనగర్ కు చెందిన రిక్షా కార్మికుడు శివ నాయక్ కొడుకు.. పవన్ నాయక్ JEE advance పరీక్షలో ఆల్ ఇండియా లెవల్లో 141 వ ర్యాంక్

Spread the love

ఫతేనగర్ కు చెందిన రిక్షా కార్మికుడు శివ నాయక్ కొడుకు.. పవన్ నాయక్ JEE advance పరీక్షలో ఆల్ ఇండియా లెవల్లో 141 వ ర్యాంక్ సాధించిన సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు … అభినందిస్తూ ఆర్థిక సాయం అందించారు.. ఈ సందర్భంలో MRO గోవర్ధన్ కూడా ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. తల్లి.. తండ్రి కూలి పని చేసుకుంటూ కష్టపడి తమ కుమారుని చదివించారని… తల్లి, తండ్రి కష్టాన్ని చూసి తను జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలనే సంకల్పంతో పవన్ నాయక్ ఆల్ ఇండియా లేవల్లో 141 వ ర్యాంకు సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందని.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన ఇటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించాలని భవిష్యత్తులో కూడా తనవంతు సహాయం అందిస్తూనే ఉంటానని అన్నారు..

Related Posts

You cannot copy content of this page