ఉమ్మడివరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం

Spread the love
Our government is not going to do anything in Sambunvaram village

సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం పిట్టంబండ సచివాలయం పరిధిలోని ఉమ్మడివరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు వచ్చాయా? లేదా? అని అగిడి తెలుకొని వారికి సంక్షేమ పథకాల ద్వారా వారు పొందిన లబ్ధి ని ప్రజలకు వివరిస్తూ, అలాగే గ్రామంలోని ప్రజలకు ఏమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలనా మరియు వినుకొండ నియోజకవర్గ లో మీ అభివృద్ధి పరిపాలనలో ఎలాంటి లోటు లేకుండా ఉన్నామని గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ సందర్భంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు. ప్రతి పక్ష పార్టీల వారి లాగా జన్మభూమి కమిటీ లాగా మెఖాలు చూసి ఫించన్ ఇచ్చే పద్ధతులు ఇప్పుడు లేవని, జన్మభూమి కమిటీల పేరుతో అన్యాయం గా ప్రజల సోమ్మును దోచుకున్నారని ఆరోపించారు.

అలాగే ప్రజా ప్రతినిధులు ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇళ్ల ముందుకు వచ్చేవారు,కాని ఇప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవటం కోసం ప్రజాప్రతినిధులు ప్రతి గడపకు వెలుతున్నామని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అని తెలుకోడమేమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు అభివృద్ధి చెందుతుంటే, ఈ ప్రతిపక్ష నేతలు చూసి ఓర్వలేక ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ప్రభుత్వం లో మీరు అందించిన సంక్షేమ పథకాలు ఏంటో చెప్పమని అడిగితే ఆ ప్రశ్న కు సమాధానం లేదని అన్నారు. ఈ సచివాలయం పరిధిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సంక్షేమ పథకాల ద్వారా 3 కోట్ల 08 లక్షల 5వేల రూపాయల నిధులను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు.

పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాలి.

పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం, వారి భాష సభ్య సమాజం తల దించుకొనేలా ఉందని అన్నారు. వారు మాట్లాడిన తీరు చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడంకోసం కృషి చేస్తున్నట్లు ఉందని అన్నారు. శాసనసభ్యులను అగౌరవంగా మాట్లాడడానన్ని తీర్వంగా ఖండించాలని తెలిపారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాయలో పడిపోయారని అన్నారు. ఎన్ టి ఆర్ పై చెప్పులతో దాడి చేయించి, వారి చావుకు కారణమై, వారిని వెన్నుపోటు పొడిచి పార్టీ ని లాగేసుకున్నది చంద్రబాబేనని గుర్తుచేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి కూడా చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు భళి అవుతున్నారు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల MPP రామిరెడ్డి ZPTC రాజా మండల వైస్సార్సీపీ మండల అధ్యక్షులు చెన్నయ్య మరియు సీనియర్ నాయకులు రామతులసి రెడ్డి ఉమ్మడివరం EX సర్పంచ్ వెంకట్రావు మరియు మండల, గ్రామ వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page