SAKSHITHA NEWS

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అని ఏకగ్రీవ తీర్మానం చేసిన నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్ క్రైస్తవ పాస్టర్లు ..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్ క్రైస్తవ పాస్టర్లు ఎన్నికలలో ఎమ్మెల్యే కే.పి వివేకానంద కే తమ మద్దతును డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు వాణి పౌల్ సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేసారు. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అలాగే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న ఎన్నికలలో తమ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కలిసికట్టుగా పనిచేసి ముచ్చటగా మూడవసారి అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుంటామని అభివృద్ధిని కొనసాగించుకుంటామని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పాస్టర్ లు అందరు ఏకగ్రీవ తీర్మానం చేసారు.

Whatsapp Image 2023 11 25 At 3.38.13 Pm

SAKSHITHA NEWS