జయశంకర్ నగర్ కాలనీ లో గల నిస్సీ ఫెయిత్ చర్చ్ నూతన మందిర ప్రతిష్ట ఆరాధన కార్యక్రమం

Spread the love

సాక్షిత : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయశంకర్ నగర్ కాలనీ లో గల నిస్సీ ఫెయిత్ చర్చ్ నూతన మందిర ప్రతిష్ట ఆరాధన కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , జగన్ , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నూతనంగా చర్చ్ ని ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని , యేసుక్రీస్తు దయతో ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని , పాస్టర్ మోజేశ్ ని అభినందించి ,శుభాకాంక్షలు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో పాస్టర్ మోజేశ్, గ్లౌరి , వివేకానంద నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, పోశెట్టి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page