ఖమ్మం జామా మసీదులో నామ ఎన్నికల ప్రచారం దుకాణాల్లో ప్రచారం

Spread the love

ముస్లిం లకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన నామ నాగేశ్వరరావు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఖమ్మం కస్బా బజార్ లోని జామా మసీదులో ముస్లిం సోదరులతో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులందర్నీ ప్రత్యేకించి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. విడి విడిగా ముస్లిం సోదరులను కలిసి ఓట్లు అడిగారు. ఈ సందర్భంగా సమీపంలోని వివిధ దుకాణాల వద్దకు కూడా వెళ్లి నామ ఓట్లు అభ్యర్దించారు. తనకే ఓటు వేసి, మెజార్టీతో గెలిపించాలని నామ వారిని కోరారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులందరికీ నామ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు ఖమర్, తాజుద్దీన్, ఫిరోజ్, మగ్బుల్ , తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page