బీ.ఆర్.ఎస్ ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్న మున్సిపల్ ఓటర్లు

Spread the love

బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం జోరుగా కొనసాగుతోంది. స్థానిక ఐ.డి.ఎ బస్తీ’లో నిర్వహించిన గడపగడపకి ప్రచారంలో పటాన్చెరువు ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి తరఫున ఆయన సతీమణి గూడెం యాదమ్మ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. బి.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు వెళ్లి బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి కి భారీగా ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధి సంక్షేమంలో దేశానికే ఆదర్శవంతంగా తయారుచేసిన బీ.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ముచ్చటగా మూడోసారి గూడెం మహిపాల్ రెడ్డి ని భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపించాలని ఓటర్లకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ మహిళలు, ప్రజా ప్రతినిధులకు, నాయకులకు మంగళ హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. గులాబీ జెండాకు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు వి.హనుమంత్ రెడ్డి , కౌన్సిలర్లు వి.నిహారిక , గోపాలమ్మ , చంద్రయ్య , స్థానిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి , లక్ష్మ రెడ్డి , దీప్తి రెడ్డి , సంపత్ రెడ్డి , శ్రీధర్ రెడ్డి , కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి , మాజీ ఎంపీటీసీ రాజు , సంతోష్ రెడ్డి , చంద్రారెడ్డి , శంకర్ , దిననాధ్ , సాయినాథ్ రెడ్డి , భాస్కర్ , శేఖర్ , నరేందర్ , వెంకీ , కృష్ణ , విక్కీ , “మా అంభి మహిళా సేవా సమితి” ఆధ్వర్యంలో మహిళలు, ఆటో యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 14 At 1.06.15 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page