కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ఎంపీలు నాగేశ్వరరావు, రవిచంద్ర, పార్థసారథి రెడ్డి,

Spread the love

MPs Nageswara Rao, Ravichandra, Parthasarathy Reddy, who met Union Minister Gadkari.

కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ఎంపీలు నాగేశ్వరరావు, రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యే వెంకటవీరయ్య

సత్తుపల్లి మీదుగా వెళ్లే జాతీయ రహదారుల వెంట డ్రైన్స్ మంజూరు చేయాల్సిందిగా వినతిపత్రం సమర్పణ

శాలువాతో గడ్కరీకి సత్కారం


సాక్షిత : ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గం సత్తుపల్లి మీదుగా వెళ్లే జాతీయ రహదారులను మరింత విస్తరించాల్సిందిగా, రోడ్లకిరువైపులా డ్రైన్స్ మంజూరు చేయాల్సిందిగాకోరుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,బండి పార్థసారథి రెడ్డిలతో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఢిల్లీలో మధ్యాహ్నం వారు గడ్కరీతో సమావేశమై తమ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా గుండా వెళ్లే జాతీయ రహదారులు, వాటి విస్తరణ, కొత్తగా కట్టిన కలెక్టరేట్ వద్ద అలైన్మెంట్ మార్పు,డ్రైన్స్ మంజూరు చేయాల్సిన అవసరం గురించి వివరించారు.ఎంపీలు, ఎమ్మెల్యే తన దృష్టికి తెచ్చిన అంశాలను మంత్రి సావధానంగా విని సానుకూలంగా స్పందించారు, ఇందుకు సంబంధించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు.ఈ సందర్భంగా వారు గడ్కరీకి ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page