మధిరలో ఎంపీ నామ విస్తృత పర్యటన పలు కుటుంబాలకు పరామర్శ

Spread the love

MP Nama’s extensive visit to Madira is a blessing to many families

మధిరలో ఎంపీ నామ విస్తృత పర్యటన

పలు కుటుంబాలకునామ పరామర్శ


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కూడా ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మధిరలో పర్యటించి, పలు కుటుంబాలను పరామర్శించారు.

మధిర పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉపాద్యాయులు ఉపాధ్యాయ సంఘం నాయకులు ఐజక్ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులను, వంకాయలపాటి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు కోనా జగదీష్ కుటుంబాన్ని, వంకాయలపాటి కృష్ణమూర్తి కుటుంబాన్ని, యన్నం సుంకిరెడ్డి, షేక్ కరీం, చెన్నంశెట్టి గోవర్ధన్ తదితర కుటుంబాలతో పాటు దెందుకూరు లో కొడవటి మధుసూధన్ రావు కుటుంబాన్ని ఎంపీ నామ పరామర్శించి, సానుభూతి తెలిపారు.

మృతులకు సంతాపం తెలిపారు. మృతుల చిత్ర పటాలకు పూలమాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. మృతుల పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్ధించారు. ఈ సందర్భంగా నామ మృతుల చిత్ర పటాలకు పూలమాల వేసి, నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, తన్నీరు రవికుమార్, మధిర మున్సిపల్ చైర్మన్ లతా జైపాల్, పార్టీ ప్రముఖులు పల్లబోతు వెంకటేశ్వరరావు, అరిగే శ్రీను బిక్కి కృష్ణప్రసాద్, రంగిశెట్టి కోటేశ్వరరావు, కూనం నాగేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చిత్తారు నాగేశ్వరరావు, తన్నీరు హరీష్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page