ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ఆదివారం మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైసీపీ నాయకులు కామూరి రమణారెడ్డి మరియు శంకర గుంటూరు కంటి ఆసుపత్రి వారిచే నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించారు.అనంతరం కంటి ఆపరేషన్ అవసరమున్నవారిని మూడు బస్సులలో 150 మందికి పైగా గుంటూరుకు తరలించారు. కంటి ఆపరేషన్ అవసరమున్నవారిని గుంటూరుకు పంపేందుకు వైసిపి నాయకులు రమణారెడ్డి స్వయంగా దగ్గరుండి మరి బస్సులలో వారిని ఆపరేషన్ కు పంపారు.ఆపరేషన్ అనంతరం రోగులను తిరిగి సురక్షితంగా గిద్దలూరు కు చేర్చడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కామూరి రమణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రమణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 150 మందికి పైగా ఆపరేషన్ కోసం తరలింపు
Related Posts
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీ
SAKSHITHA NEWS డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ…
పైడివాడ అగ్రహారం గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం.
SAKSHITHA NEWS పైడివాడ అగ్రహారం గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం. SAKSHITHA NEWS