16 నుంచి తెలంగాణ‌లో మోడీ మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌

Spread the love

హైదరాబాద్:-పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ మరింత దూకుడు పెంచింది. బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 16, 18, 19 తేదీల్లో రాష్ట్రంలో మోదీ పర్యటన కొనసాగనుంది.అయితే, తేదీలను సూత్రప్రాయంగా ఖరారు చేసినట్లు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ప్రధాని సభలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ముఖ్యనేతలతో చర్చించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి త్వరలో ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Related Posts

You cannot copy content of this page