శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love

శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని ఏపీహెచ్ బీ కాలనీ శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటానని పేర్కొన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి చల్లని చూపు ప్రజలందరిపై తప్పక ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page