కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి – ఎమ్మెల్యే సైదిరెడ్డి

Spread the love

హుజూర్ నగర్ (సాక్షిత ప్రతినిధి)

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోనీ 18వ వార్డు లింగగిరి నందు నిర్వహించిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మునిసిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంటి వెలుగు కార్యక్రమంలోనే కండ్లను పరీక్షించి దృష్టిలోపం ఉన్నవారికి కంటి సమస్యలు ఉన్న వారికి సంబంధించిన వైద్యం కూడా ప్రభుత్వమే అందిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వివిధ హోదాలలో ఉన్న నాయకులు, వైద్యాధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page