ప్రగతి యాత్ర‘లో భాగంగా 108వ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటన…

Spread the love

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కేటీఅర్ సహకారంతో నియోజకవర్గం ప్రతి కాలనీ బస్తీని అభివృద్ధి చేసాం – ఎమ్మెల్యే కె పి వివేకానంద్.

జగద్గిరిగుట్ట శ్రీనివాస్ నగర్ కాలనీలో పాదయాత్ర…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో “ప్రగతి యాత్ర”లో భాగంగా 108వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా పూర్తిచేసిన భూగర్భ డ్రైనేజీ, పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. కాగా సిసి రోడ్లు పూర్తి చేయాలని కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలిచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అర్వులైన అందరు సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కేటీఅర్ సహకారంతో కుత్బుల్లాపూర్ నియోజికవర్గాని అభివృద్ధి పరుచుకున్నాం, రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిదుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, డివిజన్ అద్యేక్షులు రుద్ర అశోక్, శ్రీనివాస్ నగర్ సంక్షేమ సంగం అద్యేక్షులు నర్సింగ్ గౌడ్, సీనియర్ నాయకులు సయిద్ రషీద్, వేణు యాదవ్, శేషిధర్, బాబు గౌడ్, హజ్రత్ అలీ, మనోజ్, దాసు, ప్రభాకర్, సయిద్ సాజీద్ , పాపుల్ గౌడ్, ఖయూమ్,సయెద్ అజాం, శేషిధర్, రావు గౌడ్, నర్సయ్య, ప్రభాకర్, కె వెంకటేష్, శ్రీ రాములు, వినయ్ గౌడ్, ఖాసీం, గౌస్ భాయ్, సారంగపాణి, రాజేందర్, మహిళా అద్యేక్షురాలు ఇందిరా గౌడ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page