బిఆర్ఎస్ తోనే అభివృద్ది మరింత వేగవంతం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

Spread the love

132- జీడిమెట్ల డివిజన్ పరిధి అంగడిపేట, ఓమ్ బుక్స్ అపార్ట్మెంట్స్, రామరాజు నగర్, జీడిమెట్ల విలేజ్, కుత్బుల్లాపూర్, జయరాం నగర్, అయోధ్య నగర్, వినాయక నగర్, కృష్ణ కుంజ్ ప్రాంతాలలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత తొమ్మిదేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో జీడిమెట్ల డివిజన్లోని అన్ని కాలనీలు, బస్తీలలో మౌలిక వసతులైన సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులను చేపట్టామన్నారు. మన ప్రాంత అభివృద్ధి – సంక్షేమం కోసం మన కోసం పనిచేసే బీఆర్ఎస్ పార్టీని నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మూడవ నెంబర్ పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పలు కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు, అభిమానులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 27 At 2.34.17 Pm
Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page