నల్ల పోచమ్మ గుడి ఆలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,130 సుభాష్ నగర్ డివిజిన్ పరిధిలోని తెలుగు తల్లి నగర్లో నూతనంగా చేపడుతున్న పోచమ్మ ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మఖ్సూద్ అలీ, పెద్ద వెంకట స్వామి, పందిరి యాదగిరి, తార సింగ్ నాయక్, ప్రభాకర్, రాజ్ కుమార్, కైసర్ పాశా, కరాటే రాజు, లంబు శ్రీను, లక్ష్మణ్, శ్రీనివాస్ గౌడ్, నారాయణ, మరియు కాలనీ సంక్షేమ సంఘం, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page