పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

Spread the love

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

మిథిలా నగర్లో సీసీ రోడ్, మంచినీటి ట్యాంక్, 2 పార్కుల నిర్మాణ పనులకు శంకుస్థాపన.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125గాజులరామారం డివిజన్ పరిధిలోని మిథిలా నగర్లోని ఈ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు 50లక్షల వ్యయంతో చేపడుతున్న మంచి నీటి వాటర్ ట్యాంక్ మరియు 27లక్షల వ్యయంతో చేపడుతున్న అంతర్గత సి సి రోడ్, రెండు కోట్ల ఎనభై లక్షల వ్యయంతో ఐదు పబ్లిక్ పార్కులు చేపట్టగా ఈ రోజు రెండు పార్కులకు ముఖ్య అథితిగా పాల్గొని శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కెసిఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సహకారంతో డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీని దశలవారీగా అభివృద్ధి పరుస్తున్నామని, మిథిలా నగర్ ని కూడా అభివృద్ధి పరిచామని రాబోయే కాలంలో ఈ కాలనీని నియోజకవర్గ పరిధిలోని ఒక ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేటర్ రాఘవేందర్ రావు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబెర్స్ రవీంద్రనాథ్ ఠాగూర్, డి ఏ చౌదరి, ప్రవీణ్ పోతినేని, ఎం ఏ సురేష్, చెంగల్ రాయుడు, లవ శివకుమార్, వెలగపూడి శ్రీనివాస్, చంద్రమోహన్, నరసింహ, శ్రావణ్, హనుమంతరావు, విద్యాసాగర్, ఎమ్మెస్ రాజు, శేషువర్ధన్, రమేష్, రామచంద్రప్ప, అంజిరెడ్డి, గంగాధర్ చారి, మరియు బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు రుద్రా అశోక్, సీనియర్ నాయకులూ సయీద్ రషీద్, మఖ్సూద్ అలీ, మసూద్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page