తన స్వగృహంలో ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే కొడాలి నాని

Spread the love

తమ సమస్యలను ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకొచ్చిన గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజానీకం…

-ప్రజా శ్రేయస్సే వైసీపీ ప్రభుత్వ చేయమన్న ఎమ్మెల్యే నాని…

గుడివాడ:గుడివాడ పట్టణం రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించారు. గుడివాడ నియోజకవర్గ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజానీకం తమ సమస్యల అర్జిలను ఎమ్మెల్యే నానికు అందజేశారు. ప్రజా సమస్యలను సౌదానంగా విన్న ఎమ్మెల్యే కొడాలి నాని, న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తనను కలిసిన వారికి భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఫోన్లు చేసిన ఎమ్మెల్యే నాని తక్షణ చర్యలు తీసుకున్నారు. ప్రజా శ్రేయస్సే వైసిపి ప్రభుత్వ ధ్యేయమని, తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రాజీ లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడ తాసిల్దార్ ఆంజనేయులు, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, గుడ్లవల్లేరు మండల వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గుదే రవి, మాజీ కౌన్సిలర్ వీరిశెట్టి నరసింహారావు, బిసి సంఘ నాయకులు ఆర్.మురళీధర్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పలు గ్రామాల పెద్దలు ఎమ్మెల్యే కొడాలి నానిను కలిసిన వారిలో ఉన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page