కాపు సంక్షేమ భవనానికి 5 ఎకరాల స్థలం కేటాయించిన ఎమ్మెల్యే

Spread the love

కాపు సంక్షేమ భవనానికి 5 ఎకరాల స్థలం కేటాయించినందుకు గాను ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపిన కాపు సంక్షేమ సంఘం నాయకులు..


సాక్షిత : తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో కాపు సంక్షేమ భవనానికి 5 ఎకరాల స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కాపు సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని చింతల్లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ధన్యవాదములు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రతి ఒక్క వర్గానికి సంక్షేమమే ద్వేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుత్బులాపూర్ నియోజకవర్గ కాపు సేవ సమితి అధ్యక్షులు సత్తి ఏసు బాబు, డేగా కృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం, సురేష్, రామచంద్రరావు, సూర్యచంద్రరావు, స్వీట్ సత్యనారాయణ, పరమేష్, సుబ్బారావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page