మెడికో ప్రీతి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు కేటీఆర్‌,ఎర్రబెల్లి దయాకర్ రావు

Spread the love

మెడికో ప్రీతి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు కేటీఆర్‌,ఎర్రబెల్లి దయాకర్ రావు


సాక్షిత : వరంగల్‌కు చెందిన మెడికో ప్రీతి కుటుంబాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు. తొర్రూరుకు వివిధ కార్యక్రమాల కోసం వచ్చిన కేటీఆర్‌ను ప్రీతి కుటుంబం కలిసేందుకు తొర్రూరుకు వచ్చింది. విష‌యం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేకంగా కేటీఆర్‌ను క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ప్రీతి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడుతూ ప్రీతి మృతికి సంబంధించిన కార‌ణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు

సంబంధిత నివేదిక‌లు వస్తున్నాయని, ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రత్యేక క‌మిటీని కూడా వేసిందన్నారు. పూర్తి వివ‌రాలు తెలిశాక స్పందిస్తామన్నారు. దోషులు ఎవరో తేలిన త‌ర్వాత ఎంత‌టి వారైనా వారిని వ‌దిలేది లేదన్నారు. ప్రీతి లాంటి ఘ‌ట‌న మళ్లీ జ‌ర‌గ‌కుండా జాగ్రత్త పడతామన్నారు. అలాగే ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వప‌రంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో ప్రతి కుటుంబ స‌భ్యులు కేటీఆర్‌, ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page