గిరిజన గురుకుల పాఠశాలలో మంత్రి సత్యవతి రాథోడ్ ఆకస్మిక తనిఖీ.

Spread the love

సాక్షిత : మహబూబాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు.
తొలుత పాఠశాలలో తరగతి గదులకు నేరుగా వెళ్లి విద్యార్థులతో మమేకమై ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు.
కష్టపడిచదివి మంచి మార్కులు సాధించాలని, ప్రభుత్వం అన్నిరకాల సౌకర్యాలను కల్పిస్తోందని విద్యార్థులకు తెలియజేసారు.
పిల్లలల్లో ఆత్మస్థైరం పెంపొందించే విధంగా పాఠాంశాలు భోదించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ……..
ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా భోజన వసతితోపాటు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా గురుకులాలు ఏర్పాటు చేశారు.
ఒక్కో విద్యార్థికి ఏటా రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్‌ స్థాయి విద్య అందిచడం జరుగుతుంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో గిరిజన విద్యార్థుల సౌకర్యార్థం కొత్తగా 14 హాస్టళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.140 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందని
మంత్రి స్పష్టం చేసారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45 గురుకుల పాఠశాలలకు ఒక్కో గురుకులానికి అదనపు సౌకర్యాలు, బిల్డింగ్ బ్లాకుల ఏర్పాటుకు 5 కోట్ల చొప్పున నిధులు మంజూరు ఇవ్వడం జరిగింది.
పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలని ఏర్పాటు చేసిన గురుకులాల్లో కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అందించడంతోపాటు చక్కని భోజనం, సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం.
కేసీఆర్ గిరిజనుల సంక్షేమానికి పెద్ద పీట వేశారు.
6 శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి.
ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు జడ్పీ చైర్మన్ కుమారి అంగోత్ బిందు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page