కేటీఆర్ ను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్

Spread the love

Minister Puvwada Ajay met KTR

కేటీఆర్ ను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్

దావోస్ పర్యటన విజయవంతం కావడం పట్ల శుభాకాంక్షలు తెలిపిన పువ్వాడ

ఖమ్మం బహిరంగ సభ సక్సెస్ కావడంతో పువ్వాడ ను అభినందించిన కేటీఆర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో భాగంగా దావోస్ పర్యటన లో తెలంగాణ రాష్ట్రానికి 21000 కోట్ల పెట్టుబడులు వచ్చిన సందర్భంగా వారిని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ బి.ఆర్.కె భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నేపథ్యంలో భారీ జన సమీకరణతో బిఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ ఖమ్మంలో విజయవంతమైన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మంత్రి అజయ్ కుమార్ అన్న కుమారుడు పువ్వాడ నరేన్ వివాహ రిసెప్షన్ ఫిబ్రవరి 10వ తేదీన ఖమ్మంలో జరగనున్న నేపథ్యంలో వారికి ఆహ్వాన పత్రికను అందజేసి సాదరంగా ఆహ్వానించారు.

Related Posts

You cannot copy content of this page