ఫ్లోరైడ్ స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్

Spread the love

సాక్షిత : మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెం లోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. స్వామితో పాటు ఆయన తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. భవిష్యత్ లోనూ అండగా ఉంటానని స్వామి కుటుంబానికి మంత్రి భరోసా ఇచ్చారు.*

గతంలో అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని మంత్రి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేశారు. దీనితో పాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేయించారు.

Related Posts

You cannot copy content of this page